Wednesday, November 16, 2011

ఏది నీది

ఏది నీది?
రచన 6 : ఆడారి అప్పన్న నాయుడు

ఇది నాది అది నీది
అని చెప్పడానికి ఎవరిచ్చారు మనిషికి ఆ హక్కు
యిప్పుడో అప్పుడో తెలియని మనిషికి ఎవరిచ్చారు ఆ హక్కు

ఈ గాలి నాదని
ఈ నీలు నావని
ఈ నది నాదని
ఈ ప్రాంతం నాదని
ఈ దేశం నాదని
చెప్పడానికి ఎవరిచ్చారు మనిషికి ఆ హక్కు
యిప్పుడో అప్పుడో తెలియని మనిషికి ఎవరిచ్చారు ఆ హక్కు


ఈ సృష్టిలో ఉన్నవన్నీ బగవంతుడవేవని
ఈ లోకములో ఉన్నవన్న అతననివేవని
మనిషికి తేయిక పోవడం మన దురదుష్టం
ఈ మనిషికి తేయిక పోవడం మన దురదుష్టం
ఈ దురదుష్టానికి ప్రతిబింబమే ఈ లోక కష్టం






Yedhi Needhi
Rachana 6: By Appanna Naidu Adari

Idhi Naadhi
Adhi Needhi
Ani Cheppadaniki yevaricharu manushalaku aa hakku

Ee gali nadhani
Ee Neelu navani
Ee nadhi naadhani
Ee prantham nadhani
Ee dhesham nadhani
Cheppadaniki yevaricharu manushulaku aa hakku
Yippudo appudo theliyani manishiki yevaricharu a hakku

Ee shrustilo vunnavanni Bagavanthunivevani
Ee lokamulo vunnavanni athanivevani
Manishiki theliyakapovadam mana dhuradhushtam
Ee Manishiki theliyakapovadam mana dhuradhushtam
Ee dhuradhustaniki prathibimbame ee loka kashtam

ఏది నీది

Monday, November 14, 2011

గతం

గతం
రచన 5- ఆడారి అప్పన్న నాయుడు

గతం మరువవద్దు

కానీ గతమే జీవితమని అనుకోవద్దు

గతం చేసిన తప్పులు గ్రహించుకో

చేసిన తప్పులు సరి దిద్దుకో

గతములో చేసిన మంచి పనులు సాగించుకో

ఆ మంచి పనులు నీ ఆత్మ త్రుప్తి యిచ్చినట్లు చూసుకో

మీ తల్లితండ్రులు అంతా గతమే

వారిని ఆత్మీయతతో ప్రేమించడము మీకు పుణ్యమే

మీ ఉపాధ్యాయులు మీకు చూపిన దారి

మీ జీవితానికి అదే మీకు రహదారి

గతం మీకు ఇచ్చును పలు ఆలోచనులు

బవిషత్ మీకు ఇచ్చును ఎత్తు పల్లాలు

జయాలలో చాలా అనంధపడవోద్దు

అపజయాలలో చాలా విచారించవద్దు

సమ గుణముతో జీవించడము నెర్చుకో

సమత్వమే శాంతియుతకు మంచిదని తెలుసుకో

Gatham
Rachana 5 : Appanna Naidu Adari

Gatham maruvavadhu
Kaani gathame jeevithamani anukovadhu
Gatham Chesina thappulu grahinchuko
Chesina Thappulu sari didhuko
Gathamulo chesina manchi panulu saaginchuko
A manchi panulu nee athma santhrupthi ichinatlu choosuko
Mee thallithandrulu antha gathame
Varini apyayathatho preminchadamu meeku punyame
Mee upayadhyulu gathamulo choopina dhari
Mee jeevithaniki adhe meeku rahadhari
Gatham meeku ichunu alochanulu
Baushatya meeku ichunu suka dhukkalu
Sukhalatho chaala anandha padavodhu
Dhukkalalo vicharamutho munigipovadhu
Samagunamutho jeevinchadam nerchuko
Samathvame shanthiyuthaku manchidhani thelusuko

Saturday, November 12, 2011

నమ్మకం

నమ్మకం

రచన : ఆడారి అప్పన్న నాయుడు 4

ప్రతి దినం సమస్యలతో ప్రారంబించవద్దు
రోజంతా సమస్య అయిపోతుంది
ప్రతి రోజు సంతోషంగా ప్రారంబించు
రోజంతా సంతోషంగా ఉండవచ్చు


నీవు ధనవంతుడు అవుతావని నమ్ము
దగ్గరగా వస్తుంది నీకు కావలసిన సొమ్ము
నీవు బీధవాడవని ఎప్పుడు అనుకోవద్దు
ఆ ఆలోచనే అవుతుంది నీకు అనుకోలేని హద్దు


నీవు విజయం సాధించగలవని నమ్మకం పెట్టు
నీవు విజేతవు అవగలవు అనుకున్నట్టు
నీవు గొప్పవాడవగలవని ఆశ పెట్టు
నీవు గొప్పవాడవుతావు అందరు గర్వ పడేటట్లు
ఎనిమిది కోట్ల తెలుగు జనులు గర్వ పడేటట్లు




Nammakam

Rachana 4: Appanna Naidu Adari, Malaysia



Prathi dhinam samasyatho prarambinchavadhu
Rojantha samasya ayipothundhi
Prathi Roju santhoshanga prarambinchu
Rojantha santhoshanga vundavcachu
Neevu dhanavanthudu avuthavani nammu
Dhaggara avuthundhi neeku kavalasina sommu
Neevu beedhavadavani yeppudu anukovadhu
Aa alochane avuthundhi neeku anukoleni hadhu
Neevu vijayamu saadhinchagalavani nammakam pettu
Neevu vijethavu avagalavu anukunnattu
Neevu goppa vadavagalavani aasha pettu
Neevu goppavadavi avuthavu andharu garva padetatlu
Yenimidhi kotla Thelugu janulu garva padetatlu

మారిషస్‌లో మనవాళ్లు, మనభాష.-

మారిషస్‌లో మనవాళ్లు, మనభాష.- పాలంకి సత్య సెల్:9848088775
November 5th, 2011

భారతదేశంలోనే ఉండిపోయిన వారికన్నా ప్రవాస భారతీయులలోనే భారతీయ సంస్కృతిపైనా, మాతృభాషపైనా మమకారమెక్కువనీ, వారే

సంస్కృతీ, సంప్రదాయాలను నిలబెడుతున్నారనీ, తెలుగు భాషను పరిరక్షిస్తున్నారనీ ఒక వాదం తరచు వినిపిస్తూ ఉంటుంది. ప్రవాస

భారతీయులంటే ముందుగా గుర్తువచ్చేది అమెరికా వాస్తవ్యులు. యల్లాప్రగడ సుబ్బారావుగారి వంటి మహామహులను వదిలేస్తే అమెరికాకు

భారతీయులు వెళ్ళడం ఆరంభమైంది 1970లలో, 1980, 90లలో ఎక్కువ. ఈ శతాబ్దిలో సామాన్యమైపోయింది. అక్కడ జరిగే సభల

గురించీ, నిర్వహించే తెలుగు తరగతుల గురించీ వార్తాపత్రికలలో చదువుతూ ఉంటాం.


ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. అమెరికాకు వలస వెళ్ళినవారి పిల్లలలో ఎందరికి తెలుగు స్వచ్ఛంగా, అమెరికా యాస లేకుండా

మాట్లాడడం వచ్చును? 1970లలో వెళ్ళిన వారి మూడవ తరానికి తెలుగుతో పరిచయమైనా ఉందా? రాజకీయ, ఆర్థిక కారణాలవల్ల

అమెరికాకు వలసలు ఆగిపోతే (ఆగిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే ప్రవాసులవల్ల ఉద్యోగాలు రావడం లేదన్న అసంతృప్తి అమెరికావారిలో

ఉంది) అక్కడే ఉండిపోయిన ప్రవాస భారతీయులు ఎంతకాలం తెలుగు భాషతో సంబంధాన్ని నిలుపుకోగలరు? విదేశంలో, ఆంగ్లం అధికార

భాష, వ్యవహార భాషా అయిన చోట అది సాధ్యమేనా?

సాధ్యమే అంటున్నారు మారిషస్‌లోని తెలుగువారు. మొట్టమొదటగా తెలుగువారు తెలుగునాటిలోని వేర్వేరు ప్రాంతాల నుంచి కార్మికులుగా

1837వ సంవత్సరంలో మారిషస్‌లో అడుగు పెట్టారు. అక్కడ అధికార భాష ఆంగ్లం. వ్యవహార భాష ఫ్రెంచి. రోడ్లమీద బోర్డులూ,

దుకాణాలపైన పేర్లూ ఫ్రెంచిలో ఎక్కువగా, ఆంగ్లంలో అక్కడక్కడా ఉంటాయి. ప్రజాసామాన్యం మాట్లాడుకునే భాష ఫ్రెంచి, ఆఫ్రికన్ సంకరమైన

క్రియలే. దేశానికి స్వాతంత్య్రం లభించాక కరెన్సీ నోట్లపై ముద్రితమైన భాషలు ఆంగ్లం కాకుండా హిందీ, తమిళం మాత్రమే. (తమిళ సోదరులకు

జోహారు. ఎక్కడున్నా, ఎప్పుడైనా తమ భాషను పరిరక్షించుకోగలరు). అటువంటి వ్యతిరేక పరిస్థితులలో కూడా నాలుగు తరాలు గడిచినా

తెలుగు భాషతో అనుబంధాన్ని మారిషస్ తెలుగు వారు తెంచుకోకుండా ఉండడం ప్రశంసనీయం కదా!

మారిషస్ దేశంలో తెలుగు భాషకున్న మంచి స్థానం గురించి తెలుసుకుంటే ఆశ్చర్యానందాలు కలుగుతాయి. అక్కడ మొత్తం తెలుగువారి సంఖ్య

అరవైవేలు మాత్రమే. అయితే ప్రతి ఊరిలోనూ ఆంధ్ర మహాసభ శాఖ ఉన్నది. (ఆంధ్ర మన్నది తెలుగుకి పర్యాయపదంగా వాడబడుతున్నది

తప్ప తెలుగు నాటిలోని ఒక్క ప్రాంతానికి పరిమితం కాదు. క్రీడాభిరామంలో ఆంధ్ర నగరమన్నమాట ఓరుగల్లు లేదా వరంగల్లు గురించి కవి

ప్రయోగించారు). ఆంధ్రమహాసభ శాఖలు 95 కాగా, ముఖ్యమైనది దేశరాజధాని పోర్ట్ లూరుూలో ఉంది. మద్రాసు రాష్ట్రం నుంచి వేర్పడి

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికై ప్రాణాలర్పించిన పొట్టిశ్రీరాములుగారి విగ్రహాన్ని వారు ప్రతిష్ఠించుకున్నారు. భారతదేశంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటువల్ల

అక్కడ తెలుగువారికి ఒరిగిందేమీ లేదు. మాతృరాష్ట్రంతో బంధాన్ని ఎన్నో దశాబ్దాలుగా దూరంగా ఉన్నా తెంచుకోలేదన్నదానికి ఇది ఉదాహరణ.

ప్రతి ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో, కళాశాలల్లో తెలుగు నేర్చుకునే సదుపాయముంది. ఆంగ్లేయుల ఏలుబడిలో కూడా విద్యార్థులకు ఆంగ్లం

ప్రథమ భాషగా, ఫ్రెంచి ద్వితీయ భాషగా, మాతృభాష మూడవభాషగా నేర్పేవారు. నేడూ అంతే. మాతృభాష నేర్వకుండా పట్టాలు

సంపాదించడం భారత దేశంలోవలె సాధ్యం కాదు. అరవైవేల మంది తెలుగువారికి 145 మంది ప్రాథమిక పాఠశాలలో, 67 మంది ఉన్నత

పాఠశాలలో, 9 మంది కళాశాలలో ఉన్నారు. దామాషా పద్ధతిన చూస్తే ఇక్కడ ఎందరు తెలుగు బోధన చెయ్యాల్సి వస్తుంది? ఇతర రాష్ట్రాలలో

తెలుగువారికి తెలుగు నేర్చుకునే అవకాశాలు ఎన్ని ఉన్నాయి?

విద్యాలయాలలో నేర్చుకునే తెలుగుకి తోడుగా ఆంధ్ర మహాసభలో కూడా నేర్చుకునే అవకాశముంది. కర్ణాటక సంగీతం, కూచిపూడి నాట్యం

నేర్పిస్తారు. ముగ్గులు వెయ్యడం కూడా నేర్చుకోవచ్చు. మారిషస్‌లో ముగ్గులు మగవాళ్ళే వేస్తారు! కళా సాంస్కృతిక మంత్రాలయ

(ప్రభుత్వశాఖ) నిర్వాహకులు నాటిక పోటీలు నిర్వహిస్తారు. స్థానిక రచయితలూ, నటీనటులూ పాల్గొంటారు.

ప్రతిరోజూ ఆకాశవాణి (రేడియో)లో మూడుగంటలు తెలుగు కార్యక్రమాలు ప్రసారవౌతాయి. అక్కడ దూరదర్శన్‌లో వారానికి రెండు

ధారావాహికలు, మాసానికి రెండు చలనచిత్రాలూ, ఇంకా ఇతర కార్యక్రమాలూ ఉంటాయి. మన దేశంలో తెలుగువారు ఎక్కువగా ఉన్న

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా తెలుగు కార్యక్రమాలు ఇంతగా ప్రసారం కాకపోవడం శోచనీయం కాదా?

ప్రథమావిభక్తి ప్రత్యయాలైన డు, ము, వు, లు పుస్తకాలకే మనమిక్కడ పరిమితం చేశాం. రాముడు, కృష్ణుడు వంటి పేర్లు ముందు

తరాలలోనే వదిలేశాం. మారిషస్‌లో తెలుగు సాహిత్యంలో, భాషాభివృద్ధిలో విశేష కృషి చేస్తున్న ముఖ్యులలో ఒకరిపేరు సంజీవ

నరసింహఅప్పడు. ఇటువంటి తెలుగు ప్రత్యయాలతో అంతమయ్యే పేర్లక్కడ సామాన్యం. తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలను వారు

నాలుగైదు తరాలు గడిచినా మరిచిపోలేదన్నదానికి ఇది ఒక ఉదాహరణ. నూటయాభై సంవత్సరాలు మాతృ రాష్ట్రానికి దూరంగా నివసిస్తున్నా

మాతృభూమితో ప్రత్యక్ష సంబంధానికి అవకాశం లేకపోయినా భారత సంప్రదాయాలనూ, మాతృభాషనూ విస్మరించకుండా రక్షించుకుంటూ

ఉండడానికి కారణమేమిటి? ప్రస్తుతం అమెరికాకు వెళ్ళేవారంతా (కొందరిని మినహాయిస్తే) డాలర్ల వ్యామోహంతో, భోగ భూమిపై ఆశతో,

మంది మనస్తత్వంతో వెళ్ళేవారే. మారిషస్‌కి వెళ్ళినవారు అలా వెళ్ళినవారు కాదు. 19వ శతాబ్ది ఆరంభం వరకూ మారిషస్ చెరుకు తోటలలో

నల్లవారు బానిసలుగా పనిచేసేవారు. బ్రిటిష్ ప్రభుత్వం బానిస విధానాన్ని రద్దు చేసింది. తోటలలో పని చెయ్యడానికి కార్మికులు

అవసరమయ్యారు. అప్పుడు మనదేశం పరాయి పాలనలో మగ్గిపోతున్నది. ఆ సమయంలోనే భయంకర క్షామం సంభవించింది. (ఆ కరువే

ఆర్థర్ కాటన్ మనస్సులో గోదావరిపై ఆనకట్ట కట్టాలన్న బీజం వేసింది). తప్పనిసరైన పరిస్థితులలో తెలుగు నాటిలోని వేర్వేరు ప్రాంతాలలోని

కార్మికులు వ్యవసాయ పరికరాలతో ఓడ ప్రయాణం చేసి మారిషస్ చేరుకున్నారు. తెలుగువారు దిగిన రేపుపట్టణం కొరింగ.

కోపంవచ్చినప్పుడూ, వెక్కిరించడానికీ తెలుగువారిని ఇతరులు కొరింగీలంటారు. (మద్రాసులో తెలుగువారిని గొల్టీలంటారు. ఈమాట ఉత్పత్తి

తెలియదు). వ్యవసాయ పరికరాలతోపాటు సాహితీ వ్యవసాయ పరికరాలైన భారత, రామాయణ, భాగవతాలూ, వేమన శతకం, నరసింహ

శతకం, ఎడ్లరామదాసు శతకం వంటి ఎన్నో గ్రంథాలను తమవెంట తీసికెళ్ళారు. ఇష్టపడి ధనవ్యామోహంతో వెళ్ళడం వేరు. కష్ట పరిస్థితులలో

జీవనోపాధికై వెళ్ళడం వేరు. అలా వెళ్ళిన వారికే ఎన్ని తరాలు గడిచినా మాతృభాషాభిమానం, మాతృదేశ సంస్కృతిపై గౌరవం తగ్గిపోవేమో.

ఇదే విషయాన్ని మనం ఫిజీద్వీపాలలో, సూరినాందేశంలో గమనించవచ్చు. శివరాత్రికి కాలి చెప్పులైనా లేకుండా కావిడిలో అభిషేకజలం

మోసుకెళ్ళడాన్ని కూడా చూడవచ్చును. ఎటొచ్చీ అభివృద్ధి చెందిన ధనిక దేశాలు కావు కనుక వీరు ప్రచారం చేసుకోలేరు.

మారిషస్‌లో తెలుగు ప్రైవేటు చానెళ్ళు ప్రసారం కావు. ఎంగిలి మంగలమైన ఇంగ్లీషు ను తప్పులు తడకలుగా గుప్పిస్తూ సంకర టింగ్లీషుని

కాకుండా స్వచ్ఛమైన తెలుగు మారిషస్ వాస్తవ్యులు మాట్లాడుతారు. ఇలా మాట్లాడడానికి ఇదే ముఖ్య కారణం. కుల, ప్రాంత భేదాలతో వేరు

కుంపట్లు పెట్టుకోకుండా అందరూ తెలుగువారమనుకోడం అన్నిటికన్నా ముఖ్య కారణం.


. .

Friday, November 11, 2011

THELUGU VAARU

తెలుగు వారు
రచన : 3 ఆడారి అప్పన్న నాయుడు
తెలుగు జనులు
తెలివైన జనులు
తెలుగు జనులు
తేజోవంతులు

తెలుగు తల్లులు
అందరిని ప్రేమిస్తారు
తెలుగు తల్లులు
అనురాగముతో ఆహ్వానితారు

తెలుగు తండ్రులు
దొర చూపుతో చూస్తారు
తెలుగు తండ్రులు
విద్యకు ప్రధానమిస్తారు

తెలుగు అమ్మాయులు
అందంగా వుంటారు
తెలుగు అమ్మాయులు
తల్లితండ్రులను ఆదరిస్తారు

తెలుగు యువకులు
బాషా అబిమానులు
తెలుగు యువకులు
చాలా ధైర్యవంతులు



Theluguvaaru

Rachana 3: Appanna Naidu Adari

Thelugu Thallulu
Andharini Premisthaaru
Thelugu Thallalu
Anuragamutho Ahvanistharu

Thelugu Thandrulu
Dhoora chooputho choostaaru
Thelugu Thandrulu
Vidhyaku Pradhanamisthaaru

Thelugu Ammayulu
Andhanga Vuntaaru
Thelugu Ammayulu
ThalliThandrulanu Adharitharu

Thelugu Yuvakulu
Bhasha Abimanulu
Thelugu Yuvakulu
Chaala Dhairyavanthulu

YEDHI MUKYAM?

ఏది ముఖ్యం ?
రచన :2 ఆడారి అప్పన్న నాయుడు

ఎంత కాలం బ్రతికావన్నది కాదు ముఖ్యం
బ్రతుకున్నకాలం ఎంత మంచి చేసావన్నది ముఖ్యం
ఎంత కాలం జీవించావన్నది కాదు ముఖ్యం
మరణం తరువాయి ఎంత కాలం జీవించగలవన్నది ముఖ్యం
ఎంతకాలం వుద్యోగం చేసావన్నది కాదు ముఖ్యం
ఆ ఉద్యోగములో ఎంత సాధించావన్నది ముఖ్యం
ఎంత మంచి వాడవన్నది కాదు ముఖ్యం
ఆ మంచితన్నాని ఎంత మందికి పంచావన్నది ముఖ్యం
ఎంత అందగాడవన్నది కాదు ముఖ్యం
ఆ అందం నీ మనషులో ఉన్నదా లేదా అన్నది ముఖ్యం
ఎంత బుద్ధివంతుడు అన్నది కాదు ముఖ్యం
ఎంత మందిని బుద్ధివంతులు చేయ గలిగావన్నది ముఖ్యం
ఎంత సంతతి వున్నారన్నదికాదు ముఖ్యం
ఆ సంతతిలో ఎంత మంది కుళాసుగా జీవిస్తారన్నది
ఎంతకాలం నాయకత్వం చేసావన్నది కాదు ముఖ్యం
ఆ నాయకత్వానికి ఎంత న్యాయం చేయగలవన్నది ముఖ్యం
ఎంత మందికి ధర్మం చేసావన్నది కాదు ముఖ్యం
ఆ ధర్మం పలితం ఆశించకుంటా చేసావా లేదా అన్నది ముఖ్యం
దేశములో ఎంత జనసంఖ్య వున్నారన్నది కాదు ముఖ్యం
ఆ జనసంఖ్యలో ఎంత మంది హాయిగా జీవిస్తున్నారన్నది ముఖ్యం

Yedhi Mukyam ?

Rachana 2: Appanna Naidu Adari, Malaysia

Yentha kaalam brathikavannadhi kadhu mukyam
Brathukunna kaalam yentha manchi chesavannadhi mukyam
Yentha kaalam jeevinchavannadhi kadhu mukyam
Maranam tharuvayi yentha kalam jeevincha galavannadhi mukyam
Yentha kaalam vudhyogam chesavannadhi kadhu mukyam
Aa vudhyogamulo yentha sadhinchavannadhi mukyam
Yentha manchi vadavannadhi kaadhu mukyam
Aa manchi thanani yentha mandhiki panchavannadhi mukyam
Yentha andhagadavannadhi kaadhu mukyam
Aa andham nee manasulo vunnadha ledha annadhi mukyam
Yentha budhivanthudu annadhi kaadhu mukyam
Aa budhitho yentha mandhini budhivanthulu cheyagaligavannadhi mukyam
Yentha santhathi vunnarannadhi kaadhu mukyam
Aa santhathilo yentha mandhi kulasugaa vunnarannadhi mukyam
Yentha kaalam nayakathvam chesavannadhi kadhu mukyam
Aa nayakathvaniki yentha nyayam cheya galigavannadhi mukyam
Yentha mandhiki dharmam chesavannadhi kadhu mukyam
Aa dharmam palitham aasinchakunta chesavaa ledha annadhi mukyam
Dhesamulo yentha mandhi jana sankya vunnarannadhi kaadhu mukyam
Aa jansankyalo yentha mandhi hayiga jeevisthunnarannadhi mukyam

……………………………………………………………………………….

MARUVAKU

మరువకు

రచన 1 -అప్పన్న నాయుడు ఆడారి

ఎంత గోప్పవాడివైన
ఎంత ధనవంతుడివైన
మరువకు నిన్ను శ్రుస్టించిన బగవంతుని
మరువకు నీకు జన్మం ఇచ్చిన తల్లి తండ్రులని

ఎంత విద్యావంతుడివైన
ఎంత గుర్తింపు వున్న
మరువకు నీకు విద్య వోసంగిన ఉపాధ్యాయులను
మరువకు నీ విద్యలో తోడుపడిన స్నేహితులను

ఎంత క్రీడాకారుడివైన
ఎంత కళాకారుడివైన
మరువకు మానవ ధర్మాని
మరువకు మానవ సత్యాని

ఎన్నిదేశాలు పర్యటించిన
ఎంత మంది నిన్ను పొగడిన
మరువకు నీ జన్మబూమిని
మరువకు నీ తెలుగు భాషని


…………………………………………………………………………….



Maruvaku

Rachana 1- Appanna Naidu Adari

Yentha goppavadavaina
Yentha dhanavanthuvuduvaina
Maruvaku ninnu shrustinchina Bagavanthuni
Maruvaku neeku janmamichina thalli thandrulani

Yentha Vidhyavanthuduvaina
Yentha gurthimpu vunna
Maruvaku Neeku Vidhya vosangina upadhyaayalani
Maruvaku nee vidhyalo neeku thodupadina snehithalani

Yentha kreedakaruduvaina
Yentha kalakaruduvaina
Maruvaku manava dharmaani
Maruvaku manava sathyaani

Yenni Dheshalu Paryatinchina
Yentha mandhi ninnu pogadina
Maruvaku nee janma boomini
Maruvaku Nee Thelugu bhashani